న్యూఢిల్లీ, అక్టోబర్ 10: పసిడి ధరలు భారీగా పడిపోయాయి. గతవారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ.540 తగ్గి రూ.52 వేల దిగువకు చేరుకున్నది. చివరకు రూ.51,625 వద్ద ముగిసింది. పసిడితోపాటు వెండి భారీగా దిగొచ్చింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.2,120 తగ్గి రూ.59,725 వద్ద ముగిసింది. హైదరాబాద్లోనూ 24 క్యారెట్ల తులం బంగా రం ధర రూ.270 తగ్గి రూ.51,930కి, 22 క్యారెట్ల ధర రూ.250 తగ్గి రూ.47,600 వద్దకు చేరుకున్నాయి. వెండి మాత్రం రూ.1,200 దిగొచ్చి రూ.64,800 వద్ద ముగిసింది.