న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ( Gold price ) మళ్లీ పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ మళ్లీ పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.422 పెరిగి రూ.45,560కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,138 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల డిమాండ్ పెరుగడమే ఇవాళ దేశీయంగా బంగారం ధర పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా ఢిల్లీలో వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.113 తగ్గి రూ.61,314కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,201 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,756 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.44 అమెరికన్ డాలర్లు పలికింది.