న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.58,600 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరగడం వల్లనే దేశీయంగా అధికమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు బంగారం రూ.58, 350గా ఉన్నది. మరోవైపు, వెండి రూ.100 పెరిగి రూ.72,600కి ఎగబాకింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1,858 డాలర్లకు చేరుకోగా, వెండి 21.75 డాలర్ల వద్ద కొనుగుతున్నది.