హైదరాబాద్, జనవరి 13: బంగారం ధరలు మరింత పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.320 ఎగబాకి రూ.63,420కి చేరుకోగా, రూ.500 అధికమైన కిలో వెండి రూ.76,500 పలికింది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 అధికమై రూ.58 వేలు పలికింది. అలాగే 24 క్యారెట్ల ధర రూ.320 పెరిగి రూ.63,270కి చేరుకున్నది.