Gold-Silver Price | న్యూఢిల్లీ, మార్చి 14: బంగారం ధరలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఢిల్లీలో తులం బంగారం ధర మరో రూ.250 అధికమై రూ.66 వేల పైకి చేరుకొని రూ.66,200 వద్ద ముగిసింది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.1,700 అధికమై రూ.77 వేలు పలికింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 9 డాలర్లు పెరిగి 2,169 డాలర్లు పలుకగా, వెండి 24.22 డాలర్ల నుంచి 24.92 డాలర్లకు ఎగబాకింది.