Gold Price | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు దిగాయి. దీంతో ఢిల్లీలో తులం బంగారం ధర రూ.450 తగ్గి రూ.73,650కి దిగింది. అంతకుముందు రూ.74,100గా ఉన్నది.
వెండి రేటూ భారీగా తగ్గింది. కిలో రూ.1,100 తగ్గి రూ.86,600 నుంచి 85,500కి దిగొచ్చింది. హైదరాబాద్లో 22 క్యారెట్ తులం బంగారం ధర రూ.500 తగ్గి రూ. 68,050 నుంచి రూ.67,550కి చేరుకున్నది. 24 క్యారెట్ ధర రూ.550 తగ్గి రూ. 73,690కి తగ్గింది. కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.89 వేలకు దిగింది.