న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.430 దిగి రూ.60,550 వద్ద స్థిరపడింది. గురువారం ఇది రూ.60,980గా ఉన్నది. కాగా, అక్షయ తృతీయ (శనివారం)కు ముందు గోల్డ్ రేటులో తగ్గుదల..
కొంతమేర అమ్మకాలను పెంచవచ్చన్న అభిప్రాయాలు ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో క్షీణత కారణంగానే దేశీయ మార్కెట్లోనూ ఈ తగ్గుదల అని చెప్తున్నారు.