Gold | దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్ట రికార్డ్ నెలకొల్పాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో ఆల్టర్నేటివ్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన బంగారం ధరకు రెక్కలొచ్చాయి. పది గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర సుమారు 3.5 శాతం పెరిగి రూ.66,270 వద్ద ముగిసింది. గత జనవరిలో స్వల్పంగా పడిపోయిన పసిడి ధర.. మార్చి నెల 11 రోజుల్లోనే ఆల్ టైం గరిష్టానికి దూసుకెళ్లడం ఇదే తొలిసారి. ఇక ఆభరణాల తయారీకి వినియోగించే 22-క్యారట్ల బంగారం తులం ధర రూ.60,750 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2178.62 డాలర్లు పలుకుతుంది.
అదే సమయంలో వెండి ధర కూడా పెరిగింది. రూ.274 పుంజుకుని రూ.72,539 వద్ద స్థిరపడింది. 10న కిలో వెండి ధర ఆదివారం రూ.77,265లకు పెరిగింది. గతేడాది డిసెంబర్ మూడో తేదీన రూ.77,073 పలికింది.2024లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న భయాలు, పెండ్లిండ్ల సీజన్ కావడంతోపాటు డాలర్ ఇండెక్స్ బలహీన పడటం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం కూడా దాని ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తున్నది.ఈ నెలలోని 11 రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగిపోయాయి. మార్చి ఒకటో తేదీన రూ.62,592గా ఉన్న 24 క్యారట్ల బంగారం తులం ధర మార్చి 11న రూ.66,270 పలికింది. అంటే రూ.3678 పెరిగిందన్న మాట.