Gold Rate | న్యూఢిల్లీ, ఆగస్టు 29: బంగారం ధరలు మళ్లీ రూ.60 వేలకు చేరువయ్యాయి. మంగళవారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రేటు సోమవారంతో పోల్చితే రూ.250 ఎగిసింది. ఢిల్లీలో రూ.59,800ని తాకింది. 22 క్యారెట్ తులం ధర కూడా రూ.230 పెరిగి రూ.54,830గా ఉన్నది. హైదరాబాద్ మార్కెట్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో పెరుగుదల ఉండగా.. 24 క్యారెట్ 10 గ్రాములు రూ.270 ఎగిసి రూ.59,670, 22 క్యారెట్ రూ.250 పెరిగి రూ.54,700 పలికాయి.
ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.600 పుంజుకొని రూ.77,100గా నమోదైంది. హైదరాబాద్లో మాత్రం రూ.80,000 వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్సు గోల్డ్ రేటు 1,924 డాలర్లు, సిల్వర్ 24.25 డాలర్లుగా ఉన్నాయి. కాగా, ఈ పండుగ సీజన్లో ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.