న్యూఢిల్లీ: ఢిల్లీలో బంగారం ధరలు ( Gold Price ) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.31 తగ్గి రూ.46,891కి పెరిగింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,922 వద్ద ముగిసింది. రూపాయి విలువ స్వల్పంగా బలపడటమే ఇవాళ ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక ఢిల్లీలో వెండి ధర కూడా ఇవాళ స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.372 తగ్గి రూ.66,072కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,444 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర రూ.1,810 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.34 అమెరికన్ డాలర్లు పలికింది.