Gold price : భారత మార్కెట్ (India Market) లో ఇవాళ ఉదయం బంగారం ధరలు (Gold prices) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా డిమాండ్ తగ్గడం బంగారం ధరల్లో ఈ మార్పునకు కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada) లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,32,290 గా నమోదైంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం రూ.1,08,240 వద్ద కొనసాగుతోంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,39,900 సమీపంలో కొనసాగుతున్నది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,45,080 గా ఉండగా.. ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోని ధరలే అమలవుతున్నాయి. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయని, అందువల్ల స్థానిక నగల దుకాణాల్లో ఖచ్చితమైన ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.