న్యూఢిల్లీ, జూలై 1: బంగారం ధరలు మరింతగా క్షీణించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల ధర బుధవారం రూ.1,300 తగ్గి రూ.1,44,500 (అన్ని పన్నులు సహా)గా నమోదైంది. మంగళవారం కూడా రూ.800 దిగజారిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే కిలో వెండి ధర రూ.5,000 ఎగిసింది.
రూ.2,35,000 వద్ద స్థిరపడింది. అంతకుముందు రోజు రూ.6,000 పుంజుకున్న సంగతి విదితమే. కాగా, హైదరాబాద్లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి రేటు తులం రూ.1,29,050 పలికింది. ఈ ఒక్కరోజే రూ.1,150 క్షీణించింది. ఇక అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ విలువ 21.75 డాలర్లు తగ్గి 3,986.07 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 58 డాలర్లకు దిగింది. అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో మార్కెట్లో బంగారం రేట్లు ఒత్తిడికి లోనవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.