న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 24 క్యారట్ స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.302 తగ్గి రూ.46,814కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,116 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఇవాళ రూ.597 తగ్గి రూ.60,625కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,222 వద్ద ముగిసింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,804 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.83 అమెరికన్ డాలర్లు పలికింది. హైదరాబాద్లో కూడా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.370 తగ్గి రూ.49,360 నుంచి రూ.48,990కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారట్ గోల్డ్ ధర రూ.350 తగ్గి రూ.45,250 నుంచి రూ.44,990కి చేరింది.