న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ బంగారం ధర స్థిరంగా ఉన్నది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.61 తగ్గి రూ.46,607కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,668 వద్ద ముగిసింది. ఇదిలావుంటే ఢిల్లీలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,094 తగ్గి రూ.64,779కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 65,873 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,800 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.76 అమెరికన్ డాలర్లు పలికింది.