Gold Rate | దేశంలో మళ్లీ బంగారం ధరలు బిరబిరమంటూ పైపైకి దూసుకెళ్లాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర రూ.970 పెరిగి రూ.56,550కి చేరుకున్నది. సోమవారం ట్రేడింగ్లో రూ.55,580 వద్ద పుత్తడి స్థిర పడింది. ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధర (పది గ్రాములకు) రూ.970 పెరిగి రూ.56,550 వద్ద ట్రేడయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారం ధరలు ఐదు వారాల గరిష్ట స్థాయిని తాకాయి. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.1,600 పెరిగి రూ.63,820కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి 20.75 డాలర్లు పలికింది.
ఓవర్సీస్ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1875 డాలర్లు పలికింది. యూఎస్ ఎకనమిక్ డేటా పాజిటివ్గా ఉండటం, డాలర్ విలువ పతనం, 2008 తర్వాత అతిపెద్ద యూఎస్బ్యాంక్ సిలికాన్ వ్యాలరీ బ్యాంకు దివాళా తీయడం వంటి ఘటనలు ఇన్వెస్టర్ సెంటిమెంట్ను బలహీన పరిచాయి. ఈ తరుణంలో బంగారమే తమకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గం అని ఇన్వెస్టర్లు భావించారని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్నీత్ దమానీ చెప్పారు.