Gold Rate | బులియన్ మార్కెట్లో బంగారం ధర భగభగమంటున్నది. సోమవారం బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.733 పెరిగి రూ.56,380లకు చేరుకున్నది. రెండు రోజుల క్రితం పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర రూ.55,647గా పలికింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ ప్రకారం తులం బంగారం ధర రూ.749 పెరిగి రూ.56,336కు దూసుకెళ్లింది. ఎంసీఎక్స్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 0.6 శాతం పెరిగి రూ.56,175కి చేరుకున్నది.
2020 ఆగస్టు ఆల్టైం రికార్డు తర్వాత పుత్తడి ధర భారీగా పెరగడం ఇదే తొలిసారి.ఐబీజేఏ వెబ్సైట్ ప్రకారం ఆగస్టు ఏడో తేదీన తులం బంగారం ధర (24 క్యారట్లు) రూ.56,254కు పెరిగింది.
మరోవైపు కిలో వెండి ధర రూ.1012 వృద్ధి చెంది రూ.69,834 వద్ద స్థిర పడింది. ఇంతకుముందు ముగిసిన సెషన్లో వెండి ధర కిలో రూ.68,822 వద్ద నిలిచింది. `సోమవారం ఏషియన్ వేళలో అమెరికా డాలర్ బలహీన పడటంతో కామెక్స్ గోల్డ్ ధర అత్యధికంగా పలికింది. రోజంతా బంగారం ధరలు బుల్లిష్గా సాగుతాయి` అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.64 వేలు పలుకుతుందని భావిస్తున్నారు.
ఓవర్సీస్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1875 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.92 డాలర్లకు చేరింది. వరుసగా రెండో నెలలో చైనాలో బంగారం రిజర్వు నిల్వలు పెరిగాయి.మూడేండ్ల తర్వాత చైనాలో బంగారం కొనుగోళ్లు టాప్లోకి వెళ్లాయి` అని ఆ అనలిస్ట్ తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.36 వద్ద స్థిర పడింది. డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పతనమైంది.