బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?.. అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రస్తుతం తులం పసిడి ధర రూ.60 వేల దరిదాపుల్లో కదలాడుతున్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కోసం గోల్డ్వైపే చూస్తున్నారు. ఈ క్రమంలోనే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10 శాతం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కు కేటాయిస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక భౌతిక బంగారం కొనడం పెట్టుబడి కాదంటున్న ఎక్స్పర్ట్స్.. నగల అవసరం ఉంటేనే ఆ ఆలోచనకు వెళ్లాలని చెప్తున్నారు.
3 శాతం జీఎస్టీ రూపంలో నష్టమే ఇందుకు కారణం. కాబట్టి డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) దిశగా ఇన్వెస్టర్లు కదలాలని అంటున్నారు. cలపై జీఎస్టీ ఉండదని, డీమ్యాట్ ఖాతా ఉంటే ఈటీఎఫ్లే ఉత్తమమని వివరిస్తున్నారు. అలాకాని పక్షంలో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాభదాయకం. ఇక సావరిన్ గోల్డ్ బాండ్లకు లాకిన్ పీరియడ్ ఐదేండ్లుంటుంది. దీంతో దీర్ఘకాలిక పెట్టుబడులకు వెళ్లాలనుకుంటే ఎస్జీబీ కొనుగోళ్లు తెలివైన నిర్ణయమని సలహా ఇస్తున్నారు. ఏటా 2.5 శాతం అదనపు రాబడిని కూడా అందుకోవచ్చు. ఇక ఎనిమిదేండ్లు ఉంచితే పన్ను మినహాయింపు లభిస్తుంది. వీటిని తనఖా పెట్టి స్వల్పకాలిక అవసరాల కోసం రుణాలనూ తీసుకోవచ్చు.