న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold rate today ) రూ.402 తగ్గి రూ.48,116కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,518 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా తగ్గడమే ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.528 తగ్గి రూ.65,218కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,746 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,857 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 25.03 అమెరికన్ డాలర్లు పలికింది.