న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold price ) రూ.119 తగ్గి రూ.46,613కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ గోల్డ్ ధర రూ.46,732 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.517 తగ్గి రూ.61,671కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.62,188 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,794 అమెరికన్ డాలర్లు, అదేవిధంగా ఔన్స్ వెండి ధర 23.66 అమెరికన్ డాలర్లు పలికింది.