Gold Price | దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.117 తగ్గి రూ.51,542లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర బలహీనంగా ఉండటంతోపాటు డాలర్పై రూపాయి మారకం విలువ బలోపేతం కావడమే దీనికి కారణం అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. డాలర్పై రూపాయి మారకం విలువ 14 పైసలు పెరిగి 75.76 వద్ద నిలిచింది. బుధవారం ట్రేడింగ్లో తులం బంగారం ధర 51,659 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.693 తగ్గి.. రూ.67,598 నుంచి రూ.66,905లకు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1926 డాలర్లు.. ఔన్స్ వెండి 24.77 డాలర్లు పలికింది. కామెక్స్ ట్రేడింగ్లో స్పాట్ బంగారం ధరలు 0.38 శాతం పతనమైందని, ఫలితంగా గురువారం ఔన్స్ పుత్తడి ధర 1926 డాలర్లకు చేరుకుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
దేశీయ మార్కెట్లో మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గురువారం తులం బంగారం ధర రూ.195 పెరిగి రూ.51,148కి చేరింది. స్పాట్ డిమాండ్ పెరగడంతో వల్లే ఫ్యూచర్ ట్రేడ్ ధర పెరిగిందంటున్నారు బులియన్ విశ్లేషకులు. ఏప్రిల్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్ ధర పది గ్రాముల పుత్తడి 0.38 శాతం (రూ.195) పెరిగి 51,148కి చేరుకున్నది. అంతర్జాతీయంగా న్యూయార్క్లోనూ ఔన్స్ బంగారం ధర 0.17 శాతం పతనమై 1935.80 డాలర్లు పలికింది.
ముంబైలో బంగారం తులం (99.9 శాతం) ధర రూ.51,484 పలికితే, బంగారం ధర (99.5 శాతం) రూ.51,278గా, కిలో వెండి ధర రూ.66,990 పలుకుతున్నది. బెంగళూరులో 99.5 శాతం ప్యూరిటీ బంగారం తులం రూ.53,320లకు చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం గ్రామ్ ధర రూ.4,972లకు చేరుకున్నది. కిలో వెండి ధర రూ.69,100 పలికింది.