ముంబై, డిసెంబర్ 15: సావరిన్ గోల్డ్ బాండ్లను రిజర్వు బ్యాంక్ మళ్లీ జారీ చేసింది. సోమవారం నుంచి ఐదురోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ బాండ్ల గ్రాము ధరను రూ.6,199గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సిరీస్-3 జారీ చేస్తున్న ఈ బాండ్లు ఈ నెల 18 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంకులతో(స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా) స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎస్ఈ, బాంబే స్టాక్ ఎక్సేంజ్ లిమిటెడ్లలో కూడా లభించనున్నాయి. అలాగే ఆన్లైన్లో చెల్లింపులు జరిపిన వారికి గ్రాముపై రూ.50 రాయితీ ఇస్తున్నది. 2023-24 ఏడాదికిగాను నాలుగోసారి బాండ్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు విక్రయించనున్నారు.