న్యూఢిల్లీ : జనరేటివ్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT)ని ఓపెన్ఏఐ లాంఛ్ చేసినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై(AI) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. చాట్జీపీటీకి యూజర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. మ్యూజిక్ కంపోజ్ నుంచి వ్యాసాలు రాయడం, కంటెంట్ ఐడియాలను జనరేట్ చేయడం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నుంచి ఎన్నో పనులను ఇంటరాక్టివ్ ఏఐ టూల్ ఇట్టే క్లియర్ చేస్తుండటంతో చాట్జీపీటీకి విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీంతో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు సైతం బార్డ్, బింగ్ పేర్లతో తమ ఏఐ చాట్బాట్స్ను ఆవిష్కరించాయి.
ఏఐ టూల్స్ రాకతో లేటెస్ట్ టెక్నాలజీని పలు కంపెనీలు వినియోగిస్తుండటంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్సదని కొందరు వాదిస్తుండగా, మరికొందరు న్యూ టెక్నాలజీతో ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఏఐకి నియంత్రణ లేకుంటే విపరిణామాలు తప్పవని టెక్ కంపెనీల సీఈవోలు చెబుతున్నారు. ఏఐ కట్టడికి పాలసీ తప్పనిసరని విధాన నిర్ణేతలతో భేటీ సందర్భంగా టెక్ సీఈవోలు స్పష్టం చేశారు.
ఇక ఏఐ గాడ్ఫాదర్స్లో ఒకరిగా పేరొందిన జెఫ్రీ హింటన్ సైతం రాబోయే 5 నుంచి 20 ఏండ్లలో ఏఐతో మానవాళికి ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఏఐ మనుషులు చేసే పనులను తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు. ఏఐ అన్ని నవలలను చదవడం ద్వారా అది మనుషులను ఒప్పించడంలో సమర్ధవంతంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏఐ టూల్స్కు అన్నీ తెలుసని, ఏ పనులు ఎలా చక్కబెట్టాలో తెలుసునని హింటన్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు విసిరే సవాల్ కంటే ఏఐతోనే మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని తేల్చిచెప్పారు. ఏఐతో వాటిల్లే ముప్పుపై మనం తక్షణం దృష్టి సారించాలని అన్నారు.
Read More :
Fire Accident | ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..