హైదరాబాద్, సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ మొదటి సారిగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఏవియేషన్ ఫోరెన్సిక్ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో జీఎమ్మార్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రతినిధుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడులు అతి పెద్ద ప్రమాదంగా మారుతుండటంతో ఏవియేషన్ రంగంలో కూడా వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు ఈ కేంద్రం చాలా ఉపయోగపడుతున్నదని జీఎమ్మార్ సర్వీసెస్ బిజినెస్ సీఈవో అశ్వానీ లోహానీ తెలిపారు. ఇందులో ఏవియేషన్ ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ విద్యను పూర్తి చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎంఓయూ కార్యక్రమంలో జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ ప్రొ.పరుల్ కుల్ష్రేష్తా, ఎన్ఎఫ్ఎస్యూ(నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ) ప్రొ.పూర్వి పోకరియాల్, ప్రొ.ఎస్.ఓ. జునారే, రాహుల్ శాండిల్య, బిత్తల్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.