RBI | ముంబై, మార్చి 6: క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కొత్తగా జారీచేసే సమయంలో అర్హత ఉన్న కస్టమర్లకు వారికి నచ్చిన నెట్వర్క్ నుంచే సదరు కార్డులను ఎంచుకునే అవకాశం కల్పించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. అలాగే ఇప్పటికే ఉన్న ఖాతాదారులకూ కార్డు రెన్యువల్ చేసేటప్పుడు ఈ సౌకర్యాన్నివ్వాలని స్పష్టం చేసింది. కాగా, క్రెడిట్ కార్డుల్ని జారీచేసే సంస్థలు కార్డ్ నెట్వర్క్స్తో ఏ రకమైన ఒప్పందాలు చేసుకోరాదని కూడా ఆర్బీఐ తాజా సర్క్యులర్లో తెలిపింది.
దీనివల్ల కస్టమర్లు వారికి నచ్చిన నెట్వర్క్స్ను ఎంచుకునే అవకాశం లేకుండా పోతుందని చెప్పింది. ఆర్బీఐ నిర్ణయంతో ఆయా కార్డుల ప్రయోజనాలు కస్టమర్లకు విస్తృత రీతిలో అందనున్నాయి. ఇదిలావుంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆంక్షల నేపథ్యంలో 80-85 శాతం పేటీఎం వ్యాలెట్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదని, మిగిలినవారూ ఇతర బ్యాంకులతో లింక్ చేసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.