హైదరాబాద్, ఆగస్టు 24: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. సెకండ్ జనరేషన్ మధ్యస్థాయి లగ్జరీ ఎస్యూవీ మాడల్ న్యూ జీఎల్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్లోని మహావీర్ మోటర్స్ షోరూం ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ కార్లు రెండు రకాల్లో లభించనుండగా.. హైదరాబాద్ ఎక్స్షోరూం ప్రకారం న్యూ జీఎల్సీ 300 ధర రూ.73.5 లక్షలు, జీఎల్సీ 220 డీ మాడల్ ధర రూ.74.5 లక్షలుగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ఈ వాహనాలను బుకింగ్ చేసుకున్న తొలి ముగ్గురు కస్టమర్లకు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తాళాలను అందజేశారు. ప్రస్తుతం సంస్థ జీఎల్ఏ, జీఎల్సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్, జీ-క్లాస్ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. 1998 నుంచి బెంజ్కు మహావీర్ మోటర్స్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నది.