న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ముకేశ్ అంబానీకి చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్..మరో రెండు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టింది. సిలికాన్ వాలీ కేంద్రస్థానంగా పనిచేస్తున్న టెక్నాలజీ స్టార్టప్లలో 15 మిలియన్ డాలర్లతో 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. సామ్సంగ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ రీసర్చ్ మాజీ ప్రెసిడెంట్, సీఈవో ప్రణవ్ మిస్త్రీ ఈ రెండు ప్లాట్ఫామ్లను ప్రారంభించారు. ఏఐ/ఎంఎల్, ఏఆర్, మెటావర్స్, వెబ్ 3.0 విభాగాల్లో బలమైన అనుభవం ఉన్న ఈ రెండు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టినట్లు జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు.