న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనల్లో రత్నాలు, ఆభరణాల రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో బుధవారం గడ్కరీ మాట్లాడుతూ.. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ నగల తయారీదారులు సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న ఆయన.. నగల డిజైన్లను మెరుగుపరిస్తే ప్రపంచ డైమండ్ జ్యుయెల్లరీ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించవచ్చని సూచించారు. ఇదిలావుంటే ఈ నెల 15 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా 300 నగరాల్లో జ్యుయెల్లరీ షాపింగ్ ఫెస్టివల్ను నిర్వహించబోతున్నట్టు జీజేసీ ప్రకటించింది.