హైదరాబాద్, అక్టోబర్ 11: ఫ్రీడమ్ పేరు తో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబుల్ సరికొత్త జార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. బహుళ వినియోగానికి సంబంధించి 10 లీటర్ల రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ను ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీఈఎఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన రిఫైనరీని రెండు దఫాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 33 ఏకరాల స్థలంలో నెలకొల్పబోతున్న ఈ రిఫైనరీ మొదటి దశలో రూ.400 కోట్ల పెట్టుబడితో మల్టీ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పా టు చేయనున్నట్టు ప్రకటించారు. రెండో విడుతలో భాగంగా రూ.200 కోట్ల పెట్టుబడితో సీడ్-క్రషింగ్ ప్లాంట్ను నెలకొల్పుతున్నది.
ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు ఏపీ, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో వంటనూనెలను విక్రయిస్తున్న సంస్థ.. త్వరలో తమిళనాడు, కేరళలో కూడా విస్తరించనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ కు ఏపీలోని కాకినాడలో రెండు, కృష్ణపట్నం వద్ద రిఫైనరీలు ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను నిరంతరం అంచనావేస్తునే, ప్రస్తుతం విడుదల చేసిన కొత్త పునర్వినియోగ 10 లీటర్ల మల్టీయూజ్ జార్ను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. భారత్లో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ విక్రయంలో తొలి స్థానంలో కొనసాగుతున్న సంస్థకు తెలంగాణలో 36% వాటా కలిగివుండగా, అదే ఏపీలో 67.5% వాటా ఉన్నది.