న్యూఢిల్లీ, మార్చి 10: ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గౌతమ్ అదానీ మరో సంస్థలో వాటా విక్రయించడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అంబుజా సిమెంట్లో 4 శాతం నుంచి 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా 450 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నది.
ఈ వాటా విక్రయ ప్రతిపాదనకు సంబంధించి అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తున్నది. దీనిపై స్పందించడానికి కంపెనీ వర్గాలు నిరాకరించాయి. గతేడాది అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్లను 10.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.