Adani-Ambani | భారత పారిశ్రామికవేత్తల్లో కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఈ ఏడాది గరిష్టంగా వ్యక్తిగత సంపద కోల్పోయిన కుబేరులు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సూచీ ప్రకారం గౌతం అదానీ వ్యక్తిగత సంపద 78 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరై పోయింది. మరోవైపు ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 500 కోట్ల డాలర్లకు పై చిలుకు నష్టపోయాయరు.
ఈ నెల ప్రారంభంలో ప్రపంచంలోకెల్లా ఇండియన్ బిలియనీర్ హోదాను ముకేశ్ అంబానీ తిరిగి పొందారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 81.5 బిలియన్ డాలర్లు. ఈ నెల 23 సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు గౌతం అదానీ వ్యక్తిగత సంపద 42.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో కొనసాగిన గౌతం అదానీ ఇప్పుడు 29వ ర్యాంక్కు పడిపోయారు. టాప్-25 బిలియనీర్స్ జాబితాలోకి గౌతం అదానీ ఇప్పట్లో వచ్చే సంకేతాలు కనిపించడం లేదు.
అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయని, స్టాక్ మార్కెట్లో మోసాలకు పాల్పడ్డారని యూఎస్ షార్ట్ షెల్లర్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక బయటపెట్టినప్పటి నుంచి అదానీ సంస్థల షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. గత నెల 24 నుంచి అదానీ స్టాక్స్ పతనం అవుతూనే ఉన్నాయి. హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారం అని అదానీ గ్రూప్ పేర్కొనా.. ఆ సంస్థల షేర్లను ఇన్వెస్టర్లు విక్రయిస్తూనే ఉన్నారు. ఫలితంగా గౌతం అదానీ వ్యక్తిగత సంపదలో గణనీయ భాగం కోల్పోయారు.
దేశంలోనే అతిపెద్ద పోర్ట్ను అదానీ గ్రూప్ నడుపుతున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాలను నడపడంతోపాటు అతిపెద్ద బొగ్గు వ్యాపార సంస్థగా అదానీ గ్రూప్ నిలిచింది. మౌలిక వసతుల రంగంలో వ్యాపార లావాదేవీలు నడుపుతున్నది.