Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): హిండెన్బర్గ్ నివేదికతో సంపదను, పరపతిని కోల్పోయిన దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. పోయిన పరపతిని తిరిగి పొందేందుకు పాత అప్పులను తీర్చడానికి కొత్తగా రుణాలు చేయడానికి సిద్ధమయ్యారు.
గత ఏడాది అంబుజా సిమెంట్స్ను కొనుగోలు చేసేందుకు చేసిన అప్పును తీర్చేందుకు గానూ దాదాపుగా రూ.31 వేల కోట్ల కొత్త అప్పు కోసం అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలైన బార్క్లేస్, డాయిష్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, మిత్సుబిషి యూఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బ్లూమ్బర్గ్ ఒక కథనాన్ని ప్రచూరించింది. ఇప్పటివరకైతే ఆయా బ్యాంకులతో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదని పేర్కొంది.