న్యూఢిల్లీ, జూలై 31: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం 51.5 శాతం కరిగిపోయింది. పెట్రో కెమికల్, సహజ వాయువు వ్యాపారాలు బలహీనంగా ఉండటంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ. 1,412 లేదా ప్రతిషేరుకు రూ.2.15 ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,915.19 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.4.38 తో పోలిస్తే సగానికి సగం తగ్గింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14 శాతం తగ్గి రూ.32,227.47 కోట్లకు చేరుకున్నది.