Reliance | రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా నాలుగు టాప్-10 కంపెనీలు రూ. 1,05,848.14 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. రిలయన్స్తోపాటు ఐటీ మేజర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన స్క్రిప్ట్ల్లో ఉన్నాయి. అత్యధికంగా టీసీఎస్ రూ.40,640.76 కోట్ల ఎం-క్యాప్ను కోల్పోయింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,49,037.36 కోట్ల వద్ద స్థిర పడింది.
మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.36,703.8 కోట్లు కోల్పోయి రూ.7,63,565.13 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.25,503.68 కోట్లు నష్టపోయి రూ.17,70,205.42 కోట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,999.9 కోట్లు పతనమై రూ.4,45,810.84 కోట్ల వద్ద స్థిర పడింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ రూ.51,628.12 కోట్ల ఎం-క్యాప్ పెంచుకున్నాయి. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,048.06 కోట్లు పెరిగి రూ.5,12,857.03 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.12,403.56 కోట్లతో రూ.5,24,180.57 కోట్ల వద్ద స్థిర పడింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,050.44 కోట్లు జత కలిసి రూ.4,60,599.20 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.4,880.07 కోట్లు పుంజుకుని రూ.8,40,204.91 కోట్ల వద్ద స్థిర పడింది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,949.67 కోట్లతో రూ.4,18,574.86 కోట్లకు పెరిగింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.1,296.32 కోట్లు పెరిగి రూ.4,45,659.60 కోట్లవద్ద స్థిర పడింది. గతవారం ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 170.49 పాయింట్లు (0.28శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 113.90 (0.64 శాతం) నష్టపోయింది.
గతవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి టాప్-10 సంస్థలకు రిలయన్స్ సారధ్యం వహిస్తుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్ నిలిచాయి.