న్యూఢిల్లీ, జనవరి 30: రైల్వే బోర్డ్ మాజీ చీఫ్ అనిల్ కుమార్ లహోటి..టెలికం రెగ్యులేటరీ అథార్టీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్గా నియమితులయ్యారు. ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా పదవికాలం నాలుగు నెలల క్రితం ముగియడంతో ఈ పదవిలో ఇప్పటి వరకు ఎవర్ని కేంద్రం నియమించలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ మంగళవారం సమావేశమై అనిల్ కుమార్ లహోటిని ట్రాయ్ చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నారు.