న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ ఇండియా (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా పునీత్ చందోక్ నియమితులయ్యారు. చందోక్ భారత్తో పాటు దక్షిణాసియాలో కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి చందోక్ నూతన బాధ్యతలు చేపడతారని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. చందోక్ గతంలో అమెజాన్.కాం క్లౌడ్ డివిజన్ ఏడబ్ల్యూఎస్లో పనిచేశారు.
భారత్, దక్షిణాసియా బిజినెస్కు ఆయన సారధ్యం వహించారు. భారత్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నందున ఈ మిషన్ గతంలో కంటే ఇక్కడ ఇప్పుడు మరింత సందర్భోచితంగా ఉందని తాను భావిస్తున్నానని చందోక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక సహా దక్షిణాసియాలో మైక్రోసాఫ్ట్ బిజినెస్ల అనుసంధానాన్ని చందోక్ పర్యవేక్షిస్తారు.
క్లౌడ్ టెక్నాలజీ మార్కెట్లో భారీ వాటాను దక్కించుకోవడంతో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా ఎదిగిన భారత్లో మరింత పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సన్నద్ధమైన క్రమంలో చందోక్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More :
AI | ఏఐ రాకతో 2030 నాటికి ఈ కొలువులు కనుమరుగు