ముంబై, ఆగస్టు 18: విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. గత వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 708 మిలియన్ డాలర్లు పెరిగి 602.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. వరుసగా మూడు వారాలుగా తగ్గుతూ వచ్చిన రిజర్వులు..ఈ నెల 11తో ముగిసిన వారాంతానికిగాను పెరగడం విశేషం.
గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 999 మిలియన్ డాలర్లు పెరిగి 534.399 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అలాగే పసిడి రిజర్వులు 340 మిలియన్ డాలర్లు తగ్గి 44.34 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అక్టోబర్ 2021లో దేశంలో విదేశీ మారకం నిల్వలు చారిత్రక గరిష్ఠ స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.