ముంబై, జూన్ 10: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా పడిపోతున్నాయి. మే నెలకుగాను 4.49 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన 8.84 బిలియన్ డాలర్లతో పోలిస్తే 49 శాతం తగ్గాయని పేర్కొంది.
ఈక్విటీల్లోకి ఎఫ్డీఐలు భారీగా పడిపోవడంతోపాటు రుణాలు, దేశీయ కంపెనీలకు గ్యారెంటీ సమస్యలు తలెత్తడం ఇందుకు కారణమని విశ్లేషించింది.