ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వార్షిక సామర్ధ్య సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పీఎస్బీ అధిపతులతో సమావేశమయ్యారు. స్మార్ట్ బ్యాంకింగ్కు బాటలు వేసే ఎన్హేన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్స్లెన్స్(ఈజ్ 4.0)ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక సామర్ధ్యం సమీక్షించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్, కొవిడ్-19 కింద ప్రకటించిన పలు ప్యాకేజ్ల అమలుపై తాము సమీక్షించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానంతరం వెల్లడించారు.
కొవిడ్-19 నేపధ్యంలోనూ బ్యాంకుల విలీన ప్రక్రియ కసరత్తుకు విఘాతం కలగలేదని మంత్రి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు రావాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆమె విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లతో సంప్రదింపులు జరపాలని బ్యాంకర్లను నిర్మలా సీతారామన్ కోరారు.ఫిన్టెక్ రంగానికి బ్యాంకులు ఊతం ఇవ్వాలని తూర్పు రాష్ట్రాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు.