Flipkart Year End Sale | మరో 23 రోజుల్లో కొత్త వసంతం ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్స్ ప్రకటించింది. ఇన్స్టంట్ డిస్కౌంట్తోపాటు బ్యాంకుల ఆఫర్లతో కలిపి రాయితీలు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ (డిసెంబర్ 9) నుంచి 16 వరకూ సాగే ఈ ఇయర్ ఎండ్ సేల్స్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతోపాటు ఫ్యాషన్, హోం అప్లియెన్సెస్పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి తెస్తున్నది. అయితే, ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ యూజర్లకు ఒక రోజు ముందు నుంచే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
రూ.69,900 విలువైన ఐ-ఫోన్ 14 ఫోన్ రూ.55 వేలకు లభిస్తుంది. మోటరోలా ఎడ్జ్40 ఫోన్ రూ.34,999 నుంచి రూ.25,499లకు, ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ రూ.7,149లకే అందుబాటులో ఉంటుంది. ఇక నథింగ్ ఫోన్2 ఫోన్ రూ.39,999 నుంచి రూ.34,999లకే అందిస్తున్నది.
ఇంకా గూగుల్ పిక్సెల్7, రియల్మీ సీ53, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ, పొకో సీ55, రియల్మీ 11 ప్రో 5జీ తదితర పలు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని సమాచారం. స్మార్ట్ ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలపై 75 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మరికొన్ని సెలెక్టెడ్ కొనుగోళ్లపై అదనపు డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు తెలిపింది.