న్యూఢిల్లీ : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఏప్రిల్ 13 నుంచి సమ్మర్ సేల్ను లాంఛ్ చేసింది. న్యూ సమ్మర్ సేవర్ డేస్ సేల్ ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 వరకూ కొనసాగుతుందని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. పిక్సెల్ 6ఏ, ఐఫోన్ 13, నథింగ్ ఫోన్ 1, రియల్మీ 10 ప్రొ+ వంటి 5జీ ఫోన్లపై సేల్లో ఈ-కామర్స్ దిగ్గజం భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్లో భాగంగా ఐఫోన్ 13 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 54,999కి అందుబాటులో ఉంది.
ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్లో పిక్సెల్ 6ఏ రూ. 26,999కే లభిస్తోంది. ఈ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ గతంలో రూ. 30,000కు లభించేది. సీమ్లెస్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో మెరుగైన కెమెరా ఫీచర్లతో ఈ ప్రీమియం ఫోన్ ఆకట్టుకునే ధరకు ఈ-కామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ ఫోన్ను కోరుకునే వారు ప్రస్తుతం రూ. 49,999కి అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3ని సొంతం చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ఫోన్పై యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ఇక ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ సందర్భంగా పిక్సెల్ 7 ప్రో రూ. 66,999 తగ్గింపు ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ డివైజ్పై ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు, బ్యాంక్ కార్డు ఆఫర్లతో స్మార్ట్ఫోన్ ధర మరింత దిగిరానుంది. ఇక రెడ్మి నోట్ 12ప్రో+ కేవలం రూ. 27,499కి రానుండగా, నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్కార్ట్పై రూ. 27,999కి లభిస్తోంది.
Read More