న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఈ-కామర్స్ దిగ్గజం ఫిప్కార్ట్ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ ఈవెంట్ను ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి 12 వరకు జరుపనుంది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లక్షల సంఖ్యలో వినియోగదార్లు, విక్రయదార్లు, చిన్న వ్యాపారులు, కిరాణాలు, బ్రాండ్లు, ఈ-కామర్స్ భాగస్వాములు పాల్గొంటారని తెలిపింది. భారత్లో రూపుదిద్దుకున్న బ్రాండ్లకు ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ ఈవెంట్లో పలు కొత్త అవకాశాలుంటాయని ఫ్లిప్కార్ట్ పేర్కొంది.