Fiscal Deficit | న్యూఢిల్లీ, మే 31: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వపు ద్రవ్యలోటు రూ.15.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇది జీడీపీలో 6.7 శాతం. ఇది 6.8 శాతం ఉంటుందని నిరుడు బడ్జెట్లో కేంద్రం అంచనా వేయగా, అటుతర్వాత ఆ అంచనాల్ని 6.9 శాతానికి సవరించారు. సవరించిన లక్ష్యానికంటే తక్కువగానే ద్రవ్యలోటు నమోదైనట్టు మంగళవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వపు మొత్తం ఆదాయం, మొత్తం ఖర్చు మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ఈ లోటు మేరకు ప్రభుత్వం మార్కెట్లో రుణాలు సమీకరిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 6.4 శాతానికి (రూ.16.61 లక్షల కోట్లు) అదుపు చేయాలని బడ్జెట్లో ప్రభుత్వం నిర్దేశించుకుంది. వివరాలివి..