న్యూఢిల్లీ, జూన్ 10: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..తన ఏఎంజీ జీటీ బ్లాక్ సిరీస్ కారు తొలి డెలివరీ చేసింది. సూపర్ ఎక్స్క్లూజివ్ మోడల్ ప్రారంభ ధర రూ.5.5 కోట్లుగా నిర్ణయించింది. కొనుగోలు చేసేవారు కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసి ఇస్తున్న ఈ కారు తొలి కస్టమర్కు అందించింది. 4 లీటర్ల వీ8 ఇంజిన్ కలిగిన ఈ కారు 537 కిలోవాట్ల శక్తినివ్వనున్నది. రెండు డోర్లు కలిగిన ఈ కారు కేవలం 3.2 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. టాప్స్పీడ్ గంటకు 325 కిలోమీటర్లు. ఈ తొలి ఏఎంజీ జీటీ బ్లాక్ సిరీస్ సూపర్ స్పోర్ట్స్ కారును భూపేశ్ రెడ్డికి అందించింది.