న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, టాటా మోటర్స్, హ్యుందాయ్లు సింగిల్ డిజిట్ అధికమవగా, మహీంద్రా, టయోటా, హోండాలు రెండంకెల వృద్ధిని సాధించాయి.
గత నెలలో మారుతి 1,64,439 యూనిట్ల కార్లను విక్రయించింది. దీంతోపాటు టాటా మోటర్స్ 74 వేలు, మహీంద్రా 70 వేలు, హ్యుందాయ్ 65 వేలు, టయోటా 18 వేల కార్లను విక్రయించింది. మరోవైపు, ద్విచక్ర వాహన సంస్థలైన హోండా మోటర్సైకిల్ అత్యధికంగా 4,47,840 యూనిట్ల బైకులను విక్రయించగా, బజాజ్ ఆటో 4.03 లక్షలు, టీవీఎస్ 3.65 లక్షలు చొప్పున అమ్మకాలు జరిపాయి.