ముంబై, డిసెంబర్ 5: హైదరాబాద్లో ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఓ టెక్-హబ్ను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.834 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో తీసుకొచ్చిన ఈ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ కమ్యూనిటీ (ఏసీసీ).. సంస్థకు భారత్లో మొదటిది కావడం గమనార్హం.
కాగా, రాష్ట్రంలో సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించేలా ఇన్నాళ్లూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక విధానాలు ఆకట్టుకున్నాయని, అందుకే ఇక్కడ మా ఈ టెక్నలాజికల్, డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ను తెచ్చామని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ స్పష్టం చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సేవలను అందించడానికి ఈ టెక్-హబ్ సంస్థకెంతో కీలకం కానుందని ఫెడెక్స్ కార్పొరేషన్ సీఈవో, అధ్యక్షుడు రాజ్ సుబ్రమణ్యం తెలిపారు. కాగా, న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ నమోదిత సంస్థ, గ్లోబల్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఫెడెక్స్ కార్ప్ అనుబంధ సంస్థే ఈ ఫెడెక్స్ ఎక్స్ప్రెస్.