ముంబై, నవంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు రెండోరోజూ నష్టాల్లోనే ముగిశాయి. గురువారం సెన్సెక్స్ 69.68 పాయింట్లు కోల్పోయి 60,836.41 వద్ద నిలిచింది.
నిఫ్టీ సైతం 30.15 పాయింట్లు దిగజారి 18,052.7 వద్ద స్థిరపడింది. కాగా, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా నాల్గోసారి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.