హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, నిర్వహణ, భవిష్యత్ టెక్నాలజీలను ప్రోత్సహించేందుకుగాను బెంగళూరులో ఈవీ ఎక్స్ఫోను నిర్వహిస్తున్నది టీ-హబ్. మే 26 నుంచి 28 వరకు బెంగళూరు వేదికగా అతి పెద్ద ఎక్స్పో నిర్వహిస్తున్నది. స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీహబ్ ఇన్నోవేటివ్ పార్టనర్గా వ్యవహరిస్తోందని టీ-హబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఈ ఎక్స్పో దోహదం చేస్తుందని టీ-హబ్ వర్గా లు తెలిపారు. మరిన్ని వివరాలకు (https://bit.ly/3MSBn V3) లో సంప్రదించాలని సూచించారు.