Reliance | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐదు రోజుల లాభాలకు సోమవారం బ్రేక్ పడింది. తొలి రోజు ట్రేడింగ్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 334 పాయింట్ల పతనంతో 60,506 పాయింట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 17,764 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇక అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ మినహా నష్టాల్లోనే సాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్పై ప్రభావం చూపాయి.
రిలయన్స్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రధాన సంస్థల షేర్లు పతనం కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగు పడటంతో అమెరికా ఫెడ్ రిజర్వ్.. వడ్డీరేట్ల పెంపుపై కఠినంగా వ్యవహరించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతోపాటు విదేశీ మదుపర్లు స్టాక్స్ విక్రయించడం సెంటిమెంట్ బలహీన పడింది.
సోమవారం ఉదయం 60,847.21 పాయింట్ల వద్ద నష్టాలతోనే ప్రారంభమైన సెన్సెక్స్.. అంతర్గత ట్రేడింగ్లో 60,345.61 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 334.98 పాయింట్ల పతనంతో 60,506.90 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ట్రేడింగ్ 17,818.55 పాయింట్ల వద్ద మొదలైంది. అంతర్గత ట్రేడింగ్లో 17,823.70 పాయింట్ల గరిష్ట స్థాయికి పెరిగి, 17,698.35 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 89.45 పాయింట్ల పతనంతో 17,764.60 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.72 వద్ద స్థిర పడింది. ఇక బీఎస్ఈ-30 ఇండెక్స్లో 22 స్టాక్స్ నష్టాలు, ఎనిమిది స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, నెస్ట్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు లబ్ధి పొందాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, రిలయన్స్, మారుతి సుజుకి స్టాక్స్ నష్టాలతో సరిపెట్టుకున్నాయి.