ముంబై, మార్చి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీ 58 వేల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం వరకు భారీగా లాభపడిన సూచీలను.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలవైపు నడిపించాయి. ముఖ్యంగా హిండెన్బర్గ్ మరో నివేదికను విడుదల చేయనున్నట్టు ప్రకటించడం దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 289.31 పాయింట్లు నష్టపోయి 57,925.28 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో 58,396.17 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఒక దశలో 57,838.85 పాయింట్ల కనిష్ఠానికి జారుకున్నది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 17,076.90 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ఒడిదుడులకు గురయ్యాయి..మార్కెట్ల ప్రారంభంలో కోలుకున్న సూచీలు చివర్లో నష్టపోయాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.