EPFO | ఇప్పటికే కరోనా మహమ్మారితో తలెత్తిన ఆర్థిక ఒత్తిళ్లు, పెట్రోల్-డీజిల్ అధిక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో విలవిల్లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రవేట్ సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సభ్యులకు 2020-21 ఆర్థిక సంవత్సర వడ్డీ ఆదాయాన్ని వారి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే దీపావళికల్లా సభ్యుల పీఎఫ్ ఖాతాలపై వడ్డీని దీపావళి పండుగకు ముందు వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది.
తాజా నిర్ణయం కరువు భత్యం పొందనున్న లక్షల మంది ప్రభుత్వోద్యోగుల్లో మరింత ఆనందం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా 8.5 శాతం వడ్డీ చెల్లించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని కేంద్ర ఆర్థిక శాఖను ఈపీఎఫ్వో బోర్డు కోరిందని వార్తలొచ్చాయి. వడ్డీరేటు పెంపు, చెల్లింపులపై ఈపీఎఫ్వో సొంత నిర్ణయాలు తీసున్నా.. ఆర్థిక శాఖ అనుమతి పొందడం తప్పని సరి.
పీఎఫ్పై కేంద్ర ప్రభుత్వం వడ్డీరేటు ఏడేండ్ల కనిష్ఠ స్థాయి 8.5 శాతానికి తగ్గించి వేసింది. అంతకుముందు 2019-20లో 8.65 శాతం, 2018-19లో 8.55, 2017-18లో 8.65 శాతం వడ్డీ అందించారు. ఈపీఎఫ్వోలో సుమారు 6 కోట్ల మంది భారతీయులు సభ్యులుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Mirnalini Ravi | అందాలతో అదరగొడుతున్న మృణాళిని రవి
హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి
గుడ్డి నిర్ణయాలొద్దు.. నీట్ను వాయిదా వేయండి..!